ఎంత ప్రయత్నించినా వాటి మధ్య విభేదాలు రావడం లేదు. పులిని దూరంగానే చూసి పోతున్నాయి గాని పలకరించడం లేదు. అలా వేచిన చాలా రోజులకి ఒకరోజు ఒక ఆవు గడ్డి మేయడానికి కాస్త దూరం వెళ్ళింది. అదను చూసిన పులి దాని దగ్గరకి వెళ్ళింది. ఇలా ఒకదాని వెంట ఒకటి తిరిగితే ప్రయోజనం లేదు, లోకం చాలా విశాలమైనది, ఎన్నో వింతలు వున్నాయి. తనని చూసి తనలాగా ఆస్వాదించాలని, ఇలానే ఉండిపోతే జీవితం వ్యర్థం అవుతుందని ఊరిస్తూ చెప్పింది. పైగా ఎవరి ఆకలి వారిదిగాని, ఒకరి ఆకలి కోసం మరొకరు అవస్థలు పడడంలో అర్ధం లేదని చెప్పింది. ఇది విన్న ఆవు నిజమే కదా మిగతా వాటి కోసం తాను ఎందుకు అవస్థ పడాలని అనుకుంది.
మర్నాడు నుండి మిగతా మూడింటికి కాస్త దూరంగానే ఉంటూ వచ్చింది. దాని పరిస్థితి తెలుసుకొని వాటిలో విభేదాలు రావడం మొదలయ్యాయి. అంతే! కొద్దిరోజులకు నాలుగు ఆవులు ఐకమత్యంతో ఉండక ఎవరి దారి అవి చూసుకున్నాయి. పులి వాటి పరిస్థితి గమనించి ఎంతో సంతోషించింది. తన ఎత్తు పారిందనుకుంది. ఏటి దగ్గరకి వచ్చిన దాన్నివచ్చినట్టు మీదపడి చంపి తినడం మొదలు పెట్టింది. అందుకే అంటారు.. చెప్పుడు మాటలు వింటే ఐకమత్యం దెబ్బతింటుందని.
